KTR-HARISH RAO: ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు (వీడియో)

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-27 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత జ్యుడీషల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్‌లో ఉంది. కవితకు జులై 1 వ తేదీన బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నేటికి (ఆగస్టు) వాయిదా వేసింది. నేడు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే హరీస్ రావు అండ్ కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Similar News