రాజ్పుత్ కర్ణిసేన రాజస్థాన్ ప్రెసిడెంట్పై కాల్పులు.. వెన్నులో బుల్లెట్..
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్లో కలకలం రేగింది.
జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్లో కలకలం రేగింది. రాజ్పుత్ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు బన్వర్సింగ్పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న బన్వర్ సింగ్.. వేదికపై నుంచి కిందికి దిగి వెళ్తుండ ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వెంటనే కర్ణిసేన కార్యకర్తలు నిందితుణ్ని పట్టుకొని చితకబాదారు. అతడిని రాజ్పుత్ కర్ణిసేన మాజీ సభ్యుడు దిగ్విజయ్గా గుర్తించారు.
పాత కక్షలతోనే ఈ హత్యాయత్నం చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక బన్వర్ సింగ్ వెన్నులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజ్పుత్ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా కర్ణిసేన వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.