ఆప్ నేత సత్యేందర్ జైన్ కు బెయిల్

ఆప్(AAP) సీనియర్ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(Styendar Jain) కు నేడు బెయిల్ మంజూరు అయింది.

Update: 2024-10-18 12:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆప్(AAP) సీనియర్ నేత, ఢిల్లీ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్(Styendar Jain) కు నేడు బెయిల్ మంజూరు అయింది. కోలకతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో జైన్ ను 2022 మేలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు రెండేళ్ల తర్వాత జైన్ కు బెయిల్ లభించింది. 2015-2016 సమయంలో హవాలా నెట్ వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు దాదాపు రూ.4.81 కోట్లు ముట్టినట్టు ఈడీ గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో సత్యేందర్ తోపాటు ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, జైన్ ను అరెస్ట్ చేసింది.


Similar News