బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం..

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2023-06-21 16:10 GMT

పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన ‘హిందుస్తానీ అవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎం-ఎస్) పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరిపోయింది. పార్టీ వ్యవస్థాపకుడు మాంఝీ, అధ్యక్షుడు సంతోష్ కుమార్ సుమన్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.

వీరి భేటీ అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ, తాము ఎన్డీలో చేరినట్టు ప్రకటించారు. కాగా, సంతోష్ సుమన్ బిహార్ సీఎం నితీశ్ కేబినెట్‌లో మంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీని జేడీయూలో విలీనం చేయాలని నితీశ్ ఒత్తిడి తెస్తున్నారని, అందుకే రాష్ట్రంలో అధికార కూటమి నుంచి బయటకొస్తున్నామని సుమన్ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నామని వెల్లడించారు.


Similar News