Jammu Kashmir : జమ్మూకశ్మీరులో 59 శాతం పోలింగ్.. ఇందర్వేల్లో 80.06 శాతం పోలింగ్
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ ఓటర్లు కదం తొక్కారు. తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ ఓటర్లు కదం తొక్కారు. తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీంతో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్లో 59 శాతం ఓటింగ్ నమోదైంది. ఈవిషయాన్ని ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె వెల్లడించారు. అత్యధికంగా ఇందర్వేల్ అసెంబ్లీ స్థానం పరిధిలో 80.06 శాతం పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా ట్రాల్ స్థానం పరిధిలో 40.58 శాతం పోలింగ్ జరిగింది. అన్ని చోట్లా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది.
పోలింగ్ శాతాలపై పూర్తిస్థాయి తుది నివేదికలను గురువారం ఉదయం ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల ముఖ్య కమిషనర్ స్పష్టం చేశారు. కశ్మీరులోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగానూ 24 చోట్ల బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ఓటింగ్ జరిగిందన్నారు.