Lucknow : ఐపీఎస్ అధికారి కుమార్తె దుర్మరణం.. హాస్టల్‌లో గుండెపోటుతో తుదిశ్వాస

దిశ, నేషనల్ బ్యూరో : ఓ ఐపీఎస్ అధికారి 19 ఏళ్ల కుమార్తె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

Update: 2024-09-01 18:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ ఐపీఎస్ అధికారి 19 ఏళ్ల కుమార్తె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే ఆమె(అనికా రస్తోగి) గుండెపోటుతో ప్రాణాలు విడిచిందని యూనివర్సిటీ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఐదేళ్ల లాకోర్సు చేస్తున్న అనిక.. ప్రస్తుతం మూడో సంవత్సరంలో ఉన్నట్లు తెలిసింది. అనికా రస్తోగి తండ్రి ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో పనిచేస్తున్నట్లు సమాచారం. అనిక శనివారం రాత్రి చనిపోగా.. ఆ వివరాలను ఆదివారం రోజు మీడియాకు పోలీసులు వెల్లడించారు.


Similar News