‘భారత్‌’ పేరు నచ్చకుంటే.. దేశం వదిలి వెళ్లిపోండి : Dilip Ghosh

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్చనున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-10 11:16 GMT

కోల్ కతా : ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్చనున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌‌గా మార్చే ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. ఆదివారం కోల్ కతాలో ఏర్పాటు చేసిన ‘చాయ్‌ పే చర్చా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్ కతాలో వలసవాదానికి ప్రతీకగా నిలిచే ప్రతీకలు అన్నింటినీ తొలగిస్తామని ప్రకటించారు.


Similar News