Udhayanidhi Stalin: 'మళ్లీ రిపీట్ చేస్తా.. ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమే'

Update: 2023-09-04 16:30 GMT

చెన్నయ్: ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన తన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఆయన సోమవారం స్పందించారు. అవసరమైతే, తాను మళ్లీ, మళ్లీ అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తానని అన్నారు. ‘మొన్న ఓ ఫంక్షన్‌లో సనాతన ధర్మం గురించి మాట్లాడాను. అక్కడ ఏం మాట్లాడానో.. దానికి కట్టుబడి ఉన్నాను. మళ్లీ మళ్లీ అదే మాట్లాడుతాను. కుల విభేదాలను ఖండిస్తూ, కేవలం హిందూ మతాన్నేకాకుండా, అన్ని మతాలనూ ఉద్దేశించి మాట్లాడాను. కానీ, నా వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోంది.

విపక్షాల ఐక్యతకు భయపడే ఇదంతా చేస్తోంది. నా వ్యాఖ్యలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమే’ అని వెల్లడించారు. ‘సనాతన ధర్మాన్ని ఆచరించేవారిని నరమేధం చేయాలని ఎక్కడా పిలుపునివ్వలేదు. సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సూత్రం. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం మానవత్వాన్ని, సమానత్వాన్ని నిలబెట్టడమే’ అంటూ ట్వీట్ చేశారు.


Similar News