రాజ్ భవన్‌లో నాకు రక్షణ లేదు: బెంగాల్ గవర్నర్ ఆనందబోస్

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజ్ భవన్‌లో తనకు రక్షణ లేదని తెలిపారు.

Update: 2024-06-20 06:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజ్ భవన్‌లో తనకు రక్షణ లేదని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతా పోలీసుల సమక్షంలో గవర్నర్ భవన్ ఉందని కాబట్టి వారితో నాకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నా వ్యక్తిగత భద్రతకు ముప్పు అని నేను నమ్మడానికి కారణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత ఇన్ చార్జ్, ఆయన బృందంతో హాని ఉందని తెలిపారు. ఈ విషయం సీఎం మమతా బెనర్జీకి తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాజ్‌భవన్‌లో నియమించబడిన పోలీసు సిబ్బంది నిరంతరం స్నూపింగ్ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారని రాజ్ వర్గాలు సైతం తెలిపాయి. కాగా, రాజ్‌భవన్‌లో మోహరించిన కోల్‌కతా పోలీసు సిబ్బంది వెంటనే ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ఆనంద బోస్ ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన చేయడం గమనార్హం.


Similar News