Gujarat : వారంలో రూ.836.36 కోట్ల డ్రగ్స్ సీజ్.. 14 మంది అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌‌‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది.

Update: 2024-08-09 13:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌‌‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.836.36 కోట్లు విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశామని గుజరాత్ హోం మంత్రి హర్ష్ రమేష్ సంఘావి శుక్రవారం వెల్లడించారు. ఈ డ్రగ్స్ సప్లై నెట్‌వర్క్‌తో ముడిపడిన 14 మందిని అరెస్టు చేశామని తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్స్‌ జాబితాలో 25.63 కేజీల మారిజువానా (గంజాయి), 12.04 కేజీల చరస్, 1,410 లీటర్ల ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్లు, 793.23 కేజీల లిక్విడ్ మెఫెడ్రోన్ ఉన్నాయని గుజరాత్ హోం మంత్రి పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ సీజ్ చేసిన వ్యవహారాల్లో మొత్తం 9 కేసులను నమోదు చేశామన్నారు. ఈవివరాలను ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. 

Tags:    

Similar News