నల్లటి ఐ ప్యాచ్తో జీ20కి జర్మనీ ఛాన్సలర్..
జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ కంటికి నల్ల రంగు ఐప్యాచ్ను ధరించి జీ20 సమావేశాలకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ కంటికి నల్ల రంగు ఐప్యాచ్ను ధరించి జీ20 సమావేశాలకు హాజరయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ఆయనకు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. అయితే దీనిపై జర్మనీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్స్లర్ ఓలాఫ్ స్కల్జ్ గతవారం జాగింగ్ చేస్తుండగా కిందపడటంతో కుడి కంటి గాయాలయ్యాయని తెలిపింది. మరికొన్ని రోజుల పాటు స్కల్జ్ ఆ బ్లాక్ కలర్ ఐ ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని పేర్కొంది.