EX MLA Weeps: బీజేపీ అధిష్టానం షాక్ ... బోరున ఏడ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే

అధిష్టానం నిర్ణయంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యేబోరున విలపించారు.

Update: 2024-09-06 11:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ అధిష్టానం తనకు టికెట్ నిరాకరించడంతో హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిరంజన్ పర్మార్ బోరున విలపించారు. తన పేరు పరిశీలనలో ఉంచారని ప్రజలకు చెప్పుకుటూ వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలంటూ ఓ ఇంటర్వ్యూలో దుఃఖాన్ని ఆపుకోలేక గుక్కపట్టి ఏడ్డారు. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బివానీ లేదా తోషామ్ నియోజకవర్గాలలో ఏదో ఒక చోట అవకాశం కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిరంజన్ పర్మార్ కు షాక్ తగిలింది. ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన ఆశించిన స్థానాలలో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కుఇంటర్వ్యూ ఇస్తూ.. అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. తానిప్పుడు నిస్సాహాయుడిగా మారానంటూ కన్నీరు పెట్టుకున్నారు. రిపోర్టర్ ఎంత సముదాయించినా దుఃకాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Similar News