కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యవర్గం ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యావర్గాన్ని ఏర్పాటు మంగళవారం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యావర్గాన్ని ఏర్పాటు మంగళవారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) ఆదేశాలతో.. పార్లమెంటు ఉభయ సభల నుంచి ముగ్గురు కార్యదర్శులను, ఒక కోశాధికారిని నియమిస్తూ ఏఐసీసీ(AICC) నేతలు ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ సభ్యుడు రంజిత్ రంజన్ ను.. లోక్ సభ నుంచి రాఘవన్, అమర్ సింగ్ లను కార్యదర్శులుగా నియమించారు. ఇక పార్లమెంటరీ కోశాధికారిగా విజయ్ వసంత్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.