రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై భారీ పాము..పరుగుతీసిన ప్రయాణికులు

Update: 2024-09-20 12:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : నిరంతరం జనసంచారంతో ఉండే రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఓ భారీ సర్పం జరజర పాకుతూ ప్రయాణికులను హడలెత్తించింది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ లోని యోగనగరి రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై నుంచి ఆరు అడుగుల పొడవైన పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. పామును చూసిన ప్రయాణికులు భయాందోళనతో తలో దిక్కుగా దూరంగా పరుగులు తీశారు. కొందరు తమ లగేజ్‌ ను కూడా ఉన్న చోటే వదిలేసి పరుగులు పెట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అనంతరం పాము సంచారం సంగతిని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఆ పాము ప్లాట్‌ఫారమ్‌పై నుంచి దూరంగా వెళ్ళిపోయింది.


https://publish.twitter.com/?query=https://x.com/KUttarakhand/status/1837045745217585620&widget=Video



Similar News