Elvish Yadav : మరోసారి ఎల్విష్ యాదవ్ను ప్రశ్నించిన ఈడీ.. ఎందుకంటే..?
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారించింది. గురువారం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న ఈడీ కార్యాలయంలో ఎల్విష్ను అధికారులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది నవంబరు 3న యూపీలోని నోయిడా నగరం సెక్టార్ 51 ఏరియాలో ఉన్న బాంక్వెట్ హాల్లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు రైడ్స్ చేశారు. అక్కడ తొమ్మిది పాములు, వాటి విషం ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయించారనే అభియోగాలతో ఐదుగురు పాములు పట్టేవాళ్లను అక్కడికక్కడే అరెస్టు చేశారు.
అయితే వారికి వెంటనే స్థానిక కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. చివరకు ఈ ఏడాది మార్చి 17న ఎల్విష్ యాదవ్ను అరెస్టు చేయగా.. ఐదు రోజుల్లోనే లోకల్ కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. పాములు, వాటి విషం విక్రయాలతో ముడిపడిన మనీలాండరింగ్ వ్యవహారంపైనే ఇప్పుడు ఎల్విష్ యాదవ్ను ఈడీ ప్రశ్నించింది. దీనిపై ఈ ఏడాది జులైలోనూ ఒకసారి అతడిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది.