కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఈడీ నోటీసులు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-10-01 17:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భూ కుంభకోణం వ్యవహారం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న వేళ మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి చేసిన ప్రకటన మేరకు ఆ భూముల్ని తిరిగి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ కుంభకోణం సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారడంతో ఆ భూముల్ని వెనక్కి ఇచ్చేస్తామని ఆయన సతీమణి పార్వతి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రకటన అనంతరం ఈడీ సమన్లు జారీ చేయడం మరింత చర్చనీయాంశమవుతోంది.


Similar News