ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్, నారాయనపూర్ స్టేషన్ల మధ్య సోమవారం ఓ డెము(డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణీకులందరూ రైలులోంచి బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. డెము రైల్లోని ఎనిమిది కోచ్లలో మంటలు చెలరేగాయి.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రైలులో మంటలు సంభవించగా, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని అధికారులు చెప్పారు. మంటలు రేగిన కోచ్లలో ఎవరూ చిక్కుకోలేదని, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.