Rajnath Singh : మహిళలపై జరుగుతున్న నేరాలపై రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-08-30 06:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠిన తరం చేసేలా మా ప్రభుత్వం సవరణలు చేసిందని ఇలాంటి కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, నేరాలను చూస్తే ఎన్ని మార్పులు చేసినా ఇంకా చేయాల్సింది ఉందనిపిస్తోదన్నారు. శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మహిళలపై నేరాల పట్ల మా ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది, కానీ చాలా రాష్ట్రాలు ఈ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్నారు. ఇటీవల కోల్ కతాలో జరిగిన హృదయ విదారక సంఘటన చాలా బాధాకరమైనది అవమానకరమైనదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో తయారు చేసిన రక్షణ పరికాలను కూడా ఎగుమతి చేస్తున్నామని 2023-24 సంవత్సరంలో భారత దేశ రక్షణ ఎగుమతి రూ. 21 వేల కోట్లు దాటిందని చెప్పారు. రక్షణ ఎగుమతులను రూ. 50 వేల కోట్లకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు.


Similar News