Vinesh Phogat : మా కష్టాలు, కన్నీళ్లను కాంగ్రెసే అర్థం చేసుకుంది : వినేష్ ఫోగట్

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-09-06 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘‘న్యాయం కోసం గతేడాది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మేం నిరసన తెలుపుతుండగా పోలీసులు కర్కశంగా ఈడ్చుకెళ్లారు. ఆ టైంలో మా బాధను, కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది’’ అని వినేష్ ఫోగట్ చెప్పారు.

‘‘కష్టకాలంలోనే తెలుస్తుంది మనవాళ్లెవరు, పరాయి వాళ్లెవరు అనేది.. మమ్మల్ని రోడ్లపైకి ఈడ్చినప్పుడు ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు మాకు అండగా నిలిచాయి’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. రోడ్డు నుంచి పార్లమెంటు దాకా ప్రతీచోటా మహిళల హక్కుల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. మహిళల హక్కుల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్, పార్టీ నేత పవన్ ఖేరా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, ఏఐసీసీ హర్యానా ఇంఛార్జి దీపక్ బబారియాల సమక్షంలో వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియాలు హస్తం పార్టీలో చేరారు.


Similar News