కాసేపట్లో ఖర్గే, రాహుల్ ప్రెస్‌మీట్

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విపక్ష ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాసేపట్లో తన స్పందనను వ్యక్తం చేయనుంది.

Update: 2024-06-04 10:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విపక్ష ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కాసేపట్లో తన స్పందనను వ్యక్తం చేయనుంది. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసే విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కనబర్చిన పనితీరు గురించి వారు మాట్లాడే అవకాశం ఉంది. విపక్షాల ఐక్యత గురించి.. ఎన్డీయే కూటమికి తగిలిన ఎదురుదెబ్బ గురించి వారు కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉంది. 


Similar News