ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం: సీఎం ప్రకటన

ఈ నెల 18వ తేదీ నుంచి ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2024-10-14 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18వ తేదీ నుంచి ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఈ క్రమంలోనే వర్షాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్.. అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో వర్షాలు, సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు. ముఖ్యంగా రాజధాని చెన్నైలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో విద్యాసంస్థలకు మంగళవారం నాడు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపటి నుంచి 18వ తేదీ వరకు ప్రైవేట్, ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఆయా సంస్థల యాజమాన్యాలకు ఆల్టిమేటం జారీ చేశారు. 

Similar News