China : భారత్‌తో సంబంధాల బలోపేతానికి మేం సిద్ధం : చైనా

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము సిద్ధమని భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ వెల్లడించారు.

Update: 2024-10-02 15:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము సిద్ధమని భారత్‌లోని చైనా రాయబారి షు ఫీహాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం కూడా ఇరుదేశాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలే ఉన్నాయని ఆయన తెలిపారు. భారత్, చైనాలు పరస్పర గౌరవభావం, పరస్పర విశ్వాసం, పరస్పర అవగాహనలతో ముందుకు సాగుతున్నాయన్నారు.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన శుభాకాంక్షల సందేశాన్ని చూసి చాలా సంతోషం కలిగిందని షు ఫీహాంగ్ చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.


Similar News