Saamana: 'వాటి కంటే ముందు.. దేశంలో ఆ సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది'
ప్రధాని మోడీపై శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ విరుచుకుపడింది.
ముంబై : ప్రధాని మోడీపై శివసేన (ఉద్ధవ్) పత్రిక ‘సామ్నా’ విరుచుకుపడింది. సన్ మిషన్, మూన్ మిషన్, వీనస్ మిషన్లపై ఫోకస్ పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వాటి కంటే ముందు దేశంలో ఉల్లి సమస్యపై దృష్టి పెట్టడం అత్యవసరమని సూచించింది. లేదంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని సంపాదకీయంలో పేర్కొంది. ‘మిషన్ సన్ సవ్యంగానే ఉంది. అయితే దేశంలో ఉల్లి ధరను స్థిరీకరించడం కూడా చాలా అవసరమని కేంద్ర సర్కారు గ్రహించాలి’ అని తెలిపింది.