బ్రేకింగ్: ఢిల్లీ సెక్రటేరియట్‌లో CBI రైడ్స్.. డిప్యూటీ CM ఆఫీస్‌లో ముమ్మరంగా సోదాలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

Update: 2023-01-14 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంలో శనివారం సీబీఐ అధికారులు రైడ్స్ చేశారు. ఢిల్లీ సచివాలయంలో ఉన్న మనీష్ సిసోడియా ఆఫీస్‌లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా మనీష్ సిసోడియా ఇంట్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ సచివాలయంలోనే సీబీఐ అధికారులు రైడ్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో గతంలో కూడా సీబీఐ మనీష్ సిసోడియా కార్యాలయం, నివాసంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News