Madhya Pradesh : దిగ్విజయ్ సింగ్ మేనల్లుడి హంగామా.. పోలీసు అధికారిపై సిగరెట్ బూడిదను చల్లి..

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మేనల్లుడు ఆదిత్య విక్రమ్ సింగ్‌పై కేసు నమోదైంది.

Update: 2024-10-12 11:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మేనల్లుడు ఆదిత్య విక్రమ్ సింగ్‌పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రఘో ఘర్ పట్టణంలో ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో ఆయనపై కేసును నమోదు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రఘో ఘర్‌లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలో ఓ వీధిలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శిస్తుండగా అక్కడికి ఆదిత్య విక్రమ్ సింగ్‌ చేరుకున్నారు.

సిగరెట్ తాగుతూ.. ఆ నాటకాన్ని ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీశారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని.. ఆదిత్య విక్రమ్ సింగ్‌‌ను పంపించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆదిత్య విక్రమ్‌సింగ్ ఓ పోలీసు అధికారిని వెనక్కి నెట్టేసి.. అతడిపైకి సిగరెట్ బూడిదను చల్లాడు. దీంతో ఆదిత్య విక్రమ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఆదిత్య తండ్రి లక్ష్మణ్ సింగ్ మాజీ ఎంపీ. దిగ్విజయ్ సింగ్‌కు స్వయానా తమ్ముడే లక్ష్మణ్ సింగ్. 


Similar News