Boat Accident In Bihar: పడవ బోల్తా.. 10 మంది విద్యార్థులు గల్లంతు..
బీహార్లోని ముజఫర్ పూర్ జిల్లా భట్గామా గ్రామంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పాట్నా : బీహార్లోని ముజఫర్ పూర్ జిల్లా భట్గామా గ్రామంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరుగు గ్రామంలోని స్కూల్కు బయలుదేరిన 32 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ భాగమతి నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికిపైగా చిన్నారులు నదిలో గల్లంతయ్యారు. స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి కొంతమంది చిన్నారులను కాపాడి ఒడ్డుకు చేర్చారు.
పోలీసులు, సహాయక సిబ్బంది కూడా వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 32 మంది స్టూడెంట్స్ లో 22 మందిని కాపాడగా.. మరో 10 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు.