'రూ.500 కోట్ల బ్లాక్ మనీ.. 50 కేజీల బంగారం ప్రైవేట్‌ లాకర్లలో దాటిపెట్టారు'.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడీ మీనా సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-10-13 14:38 GMT

జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడీ మీనా సంచలన ఆరోపణలు చేశారు. జైపూర్‌లోని 100 ప్రైవేట్ లాకర్లలో కొందరు వ్యక్తులు రూ.500కోట్ల నల్లధనాన్ని, 50కిలోల బంగారన్ని దాచిపెట్టారని ఆరోపించారు. పోలీసులు వచ్చి ఆ లాకర్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ లాకర్లు ఎవరివి అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. ఈ మేరకు పింక్ సిటీలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ లాకర్లు ఎవరివో ఇప్పుడే చెబితే, రాజకీయ ఒత్తిళ్లతో వాటిని తెరిచే అవకాశం ఉండదని అన్నారు. అనంతరం ఆ లాకర్లు గల బిల్డింగ్‌ వద్దకు వెళ్లిన ఆయన.. పోలీసులు వచ్చి తక్షణమే వాటిని తెరవాలని డిమాండ్ చేశారు. కాగా, రాజ్యసభ ఎంపీగా ఉన్న మీనా.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సవాయి మాధోపుర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.


Similar News