మధ్యప్రదేశ్లో బీజేపీ దూకుడు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ దుసుకుపోతున్నది.
దిశ,డైనమిక్ బ్యూరో : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ దుసుకుపోతున్నది. 52 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కిస్తున్నారు. బీజేపీ 156 కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 71 కి పైగా సీట్లతో వెనుకంజలో ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కమల్నాథ్ వెనుకంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ముందజలో ఉన్నారు. బీజేపీ నేత ప్రహ్లాద్ సింగ్ పటేల్, జైవర్దన్ సింగ్ ముందంజలో ఉన్నారు.