బీహార్లో చిన్నారుల బస్సుకు నిప్పు పెట్టె యత్నం!

బీహార్లో కొంతమంది ఆకతాయిలు ఓ దారుణానికి ప్రయత్నించారు.

Update: 2024-08-21 15:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీహార్లో కొంతమంది ఆకతాయిలు ఓ దారుణానికి ప్రయత్నించారు. ఆగస్టు 21 బుధవారం నాడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిరసనలు జరుగుతున్న వేళ చిన్నారులకు నిప్పి పెట్టె దుశ్చర్యకు పాల్పడ్డారు. బీహార్లోని గోపాల్ గంజ్ లో నిరసనకారులు భారత్ బంద్ కు మద్దతుగా ధర్నా చేస్తున్నారు. అంతలో వారి పక్కనుండి ఓ పాఠశాల బస్ వెళ్తుండగా.. దుండగులు కర్రలతో ఆ బస్సుపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. కొంతమంది ఆ బస్సు టైర్లకు నిప్పు పెట్టగా... అందులోని చిన్నారులు హాహాకారాలు చేశారు. ఇది గమనించిన పోలీసులు, స్థానికులు వెంటనే ఆ నిప్పును ఆర్పివేసి, బస్సును అక్కడి నుండి ముందుకు పంపించారు. కాగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను అక్కడికి చేర్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై దుండగుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ప్రత్యేక బెంచ్ వెలువరించిన తీర్పును నిరసిస్తూ నేడు భారత్ బంద్ చేపట్టారు.   


Similar News