ఆసుపత్రిలో చేరిన అద్వానీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణా అద్వానీ అస్వస్థతతో మంగళవారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణా అద్వానీ అస్వస్థతతో మంగళవారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తుండగా.. వృద్దాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలే తప్ప పెద్దగా ఆందోళన పడాల్సింది ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గతనెలలో కూడ అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బీజేపీలో మోస్ట్ సీనియర్ నాయకుల్లో ఒకరైన అద్వానీ 2002 నుండి 2004 వరకు ఉప ప్రధానిగా. 1999 నుండి 2004 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు.