Delhi woman: మహిళ బెడ్‌రూమ్‌, బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ బెడ్ రూం, బాత్ రూంలో ఓ వ్యక్తి రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చాడు.

Update: 2024-09-24 13:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ బెడ్ రూం, బాత్ రూంలో ఓ వ్యక్తి రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చాడు. దీంతో అప్రమత్తమైన మహిళ వాటిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన మహిళ ఢిల్లీలోని కరణ్‌పూర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. యూపీలోని తన స్వగ్రామానికి పోయినప్పుడు ఇంటి యజమాని కుమారుడు కరణ్‌కు తాళం ఇచ్చి వెళ్లేవారు. దీంతో కరణ్ ఆమె లేని టైంలో మహిళ బాత్రూమ్, బెడ్‌రూమ్‌ రూంలో సీసీ కెమెరాలు అమర్చారు. తిరిగి ఇంటికి తిరిగి వచ్చిన మహిళ తన వాట్సాప్‌లో అనుచిత కార్యకలాపాలను గమనించింది. ఓ ల్యాప్ టాప్‌కు తనకు తెలియకుండానే వాట్సాప్ కనెక్ట్ అవడంతో అప్రమత్తమైంది.

అనుమానం వచ్చి ప్లాట్‌లో చెక్ చేయగా బాత్రూమ్ బల్బ్ హోల్డర్‌లో స్పై కెమెరా కనిపించింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి రికార్డ్ చేసిన వీడియోలను భద్రపరచడానికి ఉపయోగించిన ఒక కెమెరా, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. 3 నెలల క్రితం బల్బ్ హోల్డర్‌లో కెమెరాను అమర్చినట్టు అంగీకరించారు. షకర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 77 ప్రకారం కేసు నమోదు చేసి కరణ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేయనున్నట్టు వెల్లడించారు. 


Similar News