BJP MLA: బాలికలకు కత్తులు పంపిణీ చేసిన బిహార్ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్

బిహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని, వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయదశమి రోజున బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ బాలికలకు కత్తులు పంపిణీ చేశారు.

Update: 2024-10-14 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని, వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయదశమి రోజున బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. హింసను ప్రేరేపించేలా మిథిలేష్ చేసిన చేసిన ప్రసంగం, ఆయన చర్యలు వివాదాస్పదంగా మారాయి. సీతామర్హి నగరంలోని కప్రోల్ రోడ్‌లోని దుర్గా పూజా పండల్‌లో ఒకదానిలో జరిగిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. “ఏ దుర్మార్గుడు అయినా మన సోదరీమణులను తాకడానికి ధైర్యం చేస్తే, అతని చేతిని ఈ కత్తితో నరికివేస్తాం. మా సోదరీమణులకు వారి చేతులు నరికివేయగల సామర్థ్యం ఉండాలి. అవసరమైతే, నేను, మీరందరూ ఈ చర్య చేయాల్సి ఉంటుంది. మా సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి ” అని అన్నారు.

కత్తుల పంపిణీ

తన చొరవకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మిథిలేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దుర్మార్గులపై చర్య తీసుకునేలా ప్రజలను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. ఇకపోతే, సీతామర్హికి చెందిన ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ నవరాత్రుల ప్రారంభం నుంచి పలు చోట్ల దుర్గా పూజా మండపాలను సందర్శించారు. అక్కడ కత్తులు పంచుతూ వార్తల్లో నిలిచారు.

Similar News