కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం..

Update: 2023-06-22 12:11 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ.. కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ పై తమకు మద్దతు ఇవ్వకపోతే శుక్రవారం విపక్షాల మీటింగ్‌కు వెళ్ళమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అల్టిమేటం ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. "కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతివ్వాలి. అలా చేయకపోతే విపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తాం. భవిష్యత్తులో జరిగే విపక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉంటాం" అని ఆప్ వర్గాలు తెలిపాయని వాటిలో ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ స్పందించారు.

"కేజ్రీవాల్‌ జీ మిమ్మల్ని ఎవరూ మిస్‌ కాలేరు.. మీరు విపక్షాల మీటింగ్‌ను దాటవేయడానికి కుంటి సాకులు వెతుకుతున్నారు.. ఈ సమావేశం మీలా షరతులు పెట్టే వాళ్ళ కోసం కాదు " అని కామెంట్ చేశారు. ఇక ఈనెల 20న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "శుక్రవారం పాట్నాలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో కేంద్రం ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని నేను భావిస్తున్న. ఇతర విపక్ష పార్టీలలా కాంగ్రెస్ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలి" అని అన్నారు.

Also Read..

బైడెన్ దంపతులకు మోడీ అద్భుతమైన గిఫ్ట్స్.. 

Tags:    

Similar News