రైలు ఢీకొని చిరుత పులి మృతి.. ఎక్కడంటే..?

రైలు ఢీకొని చిరుతపులి మృతి చెందింది.

Update: 2024-06-28 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీకొని చిరుతపులి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజురా అటవీ ప్రాంతంలోని చనఖా గ్రామం గుండా వెళ్తున్న రైల్వే ట్రాక్‌ను చిరుతపులి దాటుతుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన చిరుతకు మూడేళ్లు ఉంటాయని అధికారులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News