ఏపీని అంధకారాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు- నారా లోకేశ్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం. బొగ్గు కొరత ఏర్పడుతుంది.. జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి […]

Update: 2021-10-16 03:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం. బొగ్గు కొరత ఏర్పడుతుంది.. జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్‌లో నిద్రపోతున్న జగన్ రెడ్డిలో చలనం లేదు. రూ.200 కోట్లకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన మీరు, బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణం. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవడంలో జగన్ రెడ్డి బిజీ అవ్వడం వలనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని’ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు.

Tags:    

Similar News