KTR.. కేసీఆర్ కూడా టీడీపీ వ్యక్తే : ఎంపీ అరవింద్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టింది. అయితే, కరోనా థర్డ్ వేవ్ భయాలు మాత్రం ఇంకా పోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు థర్డ్ వేవ్‌తో భయపడుతుంటే.. టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రం.. ఈటల ఫీవర్‌తో భయపడుతున్నారని అన్నారు. థర్డ్ వేవ్ ముందు ఔట్ సోర్సింగ్ నర్సుల తొలగింపు సరికాదని విమర్శించారు. ఈ […]

Update: 2021-07-10 02:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టింది. అయితే, కరోనా థర్డ్ వేవ్ భయాలు మాత్రం ఇంకా పోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు థర్డ్ వేవ్‌తో భయపడుతుంటే.. టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రం.. ఈటల ఫీవర్‌తో భయపడుతున్నారని అన్నారు. థర్డ్ వేవ్ ముందు ఔట్ సోర్సింగ్ నర్సుల తొలగింపు సరికాదని విమర్శించారు.

ఈ సందర్భంగానే.. రేవంత్ రెడ్డిని టీడీపీ అని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని చురకలు అంటించారు. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే అని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లో మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News