లైంగికదాడి కేసు.. ఇంకా పరారీలోనే యూట్యూబర్ హర్షసాయి
యువతిని నమ్మించి మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు నిన్న (గురువారం)ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: యువతిని నమ్మించి మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు నిన్న (గురువారం)ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈ-మెయిల్లు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష సాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్తో పాటు సీసీ ఫుటేజీ, ఫొటోలు, వాట్సాప్ చాటింగ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.