ప్రభాస్ ఫోన్‌లో స్క్రీన్ సేవర్ పిక్ ఎవరిది పెట్టుకున్నాడో తెలుసా..? మోస్ట్ స్పెషల్ పర్సన్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-24 02:16 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా నిన్న యంగ్ రెబల్ స్టార్ బర్త్‌డే స్పెషల్‌గా రాజాసాబ్ నుంచి షాకింగ్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఈ క్రమంలో మన డార్లింగ్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..

సాధారణంగా మనం ఫోన్ స్క్రీన్‌పై మనకు ఇష్టమైన వారి ఫొటో లేదా మన పిక్స్‌లలోనే బెస్ట్ పిక్‌ని మనం స్క్రీన్ షేవర్‌గా పెట్టుకుంటాము కదా. అలాగే ప్రభాస్ కూడా తనకు స్పెషల్ పర్సన్ అయిన వారి పిక్‌ను స్క్రీన్ షేవర్‌గా పెట్టుకున్నాడట. మరి అతను పెట్టుకున్న ఆ ఫొటో ఎవరిది అంటే.. ప్రభాస్ తల్లి - తండ్రి - ప్రభాస్ కలిసి దిగిన ఫోటో. ఈ ఫొటోని ఎప్పుడో ఆయన స్క్రీన్ సేవర్‌గా పెట్టుకున్నారట. అప్పటి నుంచి అలాగే అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారట. ఇక ఆ ఫొటో చూసినప్పుడల్లా తన నాన్న తన పక్కనే ఉన్నాడు అని భావిస్తూ ఉంటాడట ప్రభాస్. ఆ కారణంగానే డార్లింగ్ కొన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ఫోన్ స్క్రీన్ సేవర్ మార్చలేదట. ఈ ఒక్క విషయంతోనే చెప్పేయొచ్చు ప్రభాస్‌కి తన తండ్రి అంటే ఎంత ఇష్టమో. అంతేకాదు యంగ్ రెబల్ స్టార్‌కి తన తల్లి అన్న కూడా చాలా చాలా ఇష్టం. ఒకానొక ఇంటర్వ్యూలో తన తల్లికి ప్రభాస్ చేతితో పెట్టిన కాఫీ అన్న.. తన చేతితో వేసిన ఆమ్లెట్ అన్నా చాలా చాలా ఇష్టం అంటూ స్వయంగా ప్రభాస్‌నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Tags:    

Similar News