Taapsee Pannu:నాలాగే జీవించాలనుకుంట.. తాప్సీ పన్ను ఆసక్తికర కామెంట్స్

ఝుమ్మంది నాదం తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను తన అందం, అభినయంతో కట్టిపడేసింది.

Update: 2024-08-04 14:38 GMT

దిశ, సినిమా: ఝుమ్మంది నాదం తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను తన అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఫుల్ క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీలో కొనసాగింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ముఖ్యంగా ఈ అమ్మడు క్రికెటర్ మిథిలీ రాజ్ బయోపిక్ అయిన సుభాష్ మిథున మిథాలీ పాత్రలో నటించి మెప్పించింది. ప్రజెంట్ ఈ అమ్మడు అక్షయ్ కుమార్‌తో కలిసి ‘ఖేల్ ఖేల్ మైన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను మరొకరిలా జీవించాలని అనుకోను. ఇతర హీరోయిన్స్‌లా ఉండాలనుకోను. నాలాగే జీవించాలనుకుంటున్నాను. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి కావాలని నేను కోరుకోవడం లేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాను. నేను ఎవ్వరి సాయంతో నడవను, ఎందుకంటే.. నేను నా స్వతహాగా ముందుకు సాగాలనుకుంటాను కాబట్టి సాయం అందుకోను’’ అని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News