Tollywood : స్కూల్ ఏజ్‌లోనే ఆవేశంగా ఆ పనిచేసిన అమ్మాయి.. ఇప్పుడేమో!

ఆ ప్రాంతమంతా విద్యార్థులతో, అక్కడికి వచ్చిన అతిథితులతో కిక్కిరిసిపోయింది. ఎదురుగా ఉన్న స్టేజ్‌ను చక్కగా అలంకరించారు. కొందరు వేదికపై కూర్చొని ఉన్నారు. అయినా ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు స్టేజీ ముందున్నవారు అటూ.. ఇటూ పదే పదే చూస్తున్నారు.

Update: 2024-07-12 06:11 GMT

దిశ, సినిమా : ఆ ప్రాంతమంతా విద్యార్థులతో, అక్కడికి వచ్చిన అతిథితులతో కిక్కిరిసిపోయింది. ఎదురుగా ఉన్న స్టేజ్‌ను చక్కగా అలంకరించారు. కొందరు వేదికపై కూర్చొని ఉన్నారు. అయినా ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు స్టేజీ ముందున్నవారు అటూ.. ఇటూ పదే పదే చూస్తున్నారు. అంతలోనే మెల్లిగా ఓ అమ్మాయి స్టేజీపైకి వచ్చింది. మొహం చూస్తే ఎంతో అమాయకంగా కనిపించిన ఆ అమ్మాయి మాట్లాడటం స్టార్ట్ చేశాక మాత్రం ఏవో మెరుపులు మెరుస్తున్నట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు అనిపించింది ప్రేక్షకులకు.

భావోద్వేగం నిండిన మాటలతో, హావ భావాలతో, ఆవేశంతో, ఆగ్రహంతో వేదిక ముందున్న వారందరినీ కట్టిపడేస్తూనే సమాజంలోని దురాచారాలపై, అసాంఘీక శక్తులపై విరుచుకుపడుతూ ఓ మంచి సందేశం కూడా ఇచ్చింది ఆ అమ్మాయి. దీంతో అక్కడున్నవారి కేరింతలతో, చప్పట్లతో సభా ప్రాంగణమంతా మారు మ్రోగిపోయింది. ప్రజలు, ప్రముఖుల ప్రశంసల వర్షంతో ఆ అమ్మాయి తడిసి ముద్దయింది.

స్కూల్ ఏజ్‌లోనే ఇంతటి ప్రతిభ, పరిణతి, ధైర్యం, ఆత్మ విశ్వాసంతో ఉందంటే.. పెద్దయ్యాక ఇంకెలా ఉంటుందోనని అందరూ మెచ్చుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, ఓ ఫేమస్ నటుడి కుమార్తె, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్. ప్రస్తుతం ఆమె చిన్నప్పుడు స్కూల్లో స్పీచ్ ఇచ్చిన త్రో బ్యాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. స్కూల్ ఏజ్‌లోనే మనసు నిండా దేశభక్తిని నింపుకొని అంతటి ఆవేశంతో మాట్లాడిందంటే.. చాలా గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. 


Similar News