అయ్యో పాపం.. ఎవరు ఊహించని స్థితిలో టాలీవుడ్ స్టార్ యాంకర్.. అసలేం జరిగిందంటే..!

టాలీవుడ్ స్టార్ యాంకర్ లాస్య అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు బుల్లి తెరపై ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్క్రీన్ మీద అంతగా కనిపించడం లేదు.

Update: 2024-10-07 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ యాంకర్ లాస్య అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు బుల్లి తెరపై ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్క్రీన్ మీద అంతగా కనిపించడం లేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మంజునాథ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కాగా ప్రస్తుతం ఈ భామకు ఇద్దరు బాబులు(జున్ను, మున్ను). అయితే ఈ భామ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు యాంకర్ రవి. వీరిద్దరు కలిసి స్మాల్ స్క్రీన్ మీద సందడి చేశారు. ఇక వీరి అన్యోన్యతను చూసి చాలామంది లవర్స్ అనుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పలు పుకార్లు షికార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి.

వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ మంజును మ్యారేజ్ చేసుకుంది. దీంతో ఆ వార్తలకు బ్రేక్ పడిపోయింది. ప్రస్తుతం ఈ భామ బుల్లి తెరపై అడపా దడపాగా కనిపిస్తుంది. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లోను కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా యాంకర్ లాస్య తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తన సెకెండ్ బాబుని ఎత్తుకుని నెత్తిపై తట్ట అందులో ఇటుకలు పెట్టుకొని మోస్తూ.. ఒక కూలీ చేసే మహిళగా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. మరి ఆమె అలా ఉండటానికి ఓ రీజనే ఉందండోయ్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి రూపానికి తగినట్లుగా తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భక్తులు, దుర్గమ్మను ఎంతో భక్తిగా పూజిస్తారు. ఈ క్రమంలోనే యాంకర్ లాస్య తన ఇంటి దగ్గర కూడా నవరాత్రి ఉత్సవాలను జరిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ బట్టలను ధరిస్తూ వాటి వెనుక ఉన్న కథలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఈ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పసుపు రంగు చీరను ధరించింది.. అది శైలపుత్రి రూపం అంటూ పసుపు రంగు ప్రాముఖ్యతను చెప్పుకొచ్చింది.

ఇక రెండో రోజు బ్రహ్మచారిని దేవి రూపం అంటూ ఆకుపచ్చ రంగు చీరను ధరించింది. ఇక మూడో రోజున చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారట. అందులో భాగంగానే బూడిద రంగు దుస్తులు ధరించింది లాస్య. ఇక వీటిని షేర్ చేస్తూ ‘ఇది మహిళా శక్తికి ప్రతిరూపం’ అనే క్యాప్షన్‌ కూడా జోడించింది. కాగా మిగిలిన ఆరు రోజులకు సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో లాస్య పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to lasyamanjunath instagram id)


Similar News