Renu Desai: బిడ్డల రక్తం కళ్ల చూస్తే ఏ తల్లి సంతోషిస్తుంది.. వారు నరకానికి పోతారు.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Update: 2024-10-07 06:22 GMT

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. జంతువులకు సాయం చేయడం కోసం విరాళాలు సేకరిస్తోంది. అంతేకాకుండా పెట్స్ కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయం చేస్తోంది. జంతువులను హింసించడం సహించని ఆమె ఫైర్ అవుతూ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటుంది. ఇటీవల ఓ యువకుడు వీధి కుక్కను తిప్పడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి నెట్టింట పెట్టడంతోనే అంతా సాధ్యం అయింది. ఇలా నిత్యం జంతువుల కోసం పోరాడుతూనే ఉంటుంది.

తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ఏముందంటే.. కొంతమంది అమ్మవారికి జంతు బలి చేస్తూ కనిపించారు. ఇక దానిపై రేణు దేశాయ్.. ‘‘ఇలా బలి ఇచ్చి చంపేస్తే దేవత, దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు. బిడ్డల రక్తం కళ్ల చూస్తే ఏ తల్లి సంతోషిస్తుంది. ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు దక్కుతుంది. ఆ దేవుడు కూడా క్షమించడు’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.




 


Similar News