Sitara Ghattamaneni: వైరలవుతోన్న సితార పాప సెల్ఫీ.. అచ్చం అలాగే ఉన్నావంటున్న నెటిజన్స్!

టాలీవుడ్ ప్రిన్సెస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలిసిందే. తరచుగా సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉండే ఈ యువరాణి ప్రజెంట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Update: 2024-07-17 08:49 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ ప్రిన్సెస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి తెలిసిందే. తరచుగా సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉండే ఈ యువరాణి ప్రజెంట్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన ఇన్‌స్టా ఐడీలో ఆమె షేర్ చేసిన ఓ క్యూట్ ఫొటోనే ఇందుకు కారణం. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ‘సో క్యూట్, క్యూటీస్, సేమ్ టు సేమ్, సిస్టర్స్ లాగానే ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఫొటో స్పెషాలిటీ ఏంటి? అనుకుంటున్నారా?

జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ హాల్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి అనేకమంది సెలబ్రిటీలు, వ్యాపార, రాజీకీయ ప్రముఖులు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీ నటులు, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన కూతురు సితార, భార్య నమ్రత శిరోద్కర్‌తో కలిసి హాజరయ్యారు.

అయితే అనంత్ అంబానీ పెళ్లిలో సితార పాప పలువురు సెలబ్రిటీలు, ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లతో సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టా‌గ్రామ్‌ ఐడీలో షేర్ చేయగా.. ప్రజెంట్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన మహేశ్ బాబు, సితార అభిమానులు క్యూరియాసిటీతో రెస్పాండ్ అవుతున్నారు. కాగా పలువురు సితార, అలియా భట్ ఫొటోను లైక్ చేయడంతోపాటు సేమ్ టు సేమ్ సిస్టర్స్‌ మాదిరిగానే ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

video Link Credits to Sitara Ghattamaneni instagram id


Similar News