చివరి క్షణంలో కూతుర్ని చూడాలనుకున్నాడు.. మెగా ఫ్యామిలీ అలా చేసిదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన శిరీష్ తల్లి!

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు.

Update: 2024-07-04 09:09 GMT

దిశ, సినిమా : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత చిరంజీవి తన కూతురుకు కళ్యాణ్ దేవ్‌తో ఘనంగా వివాహం జరిపించారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువ లేక పోయింది. ప్రస్తుతం వారిద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. శ్రీజ, కళ్యాణ్ దేవ్‌తో విడిపోయింది అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక ఇదంతా పక్కన పెడితే శిరీష్ చనిపోయినప్పటి నుంచి శ్రీజ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్త నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష తల్లి మెగా ఫ్యామిలీ పై మండిపడింది. శ్రీజ, శిరీష్‌లకు కూతురు ఉన్నవిషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే చివరి క్షణంలో తన కూతుర్ని చూడాలి అనుకున్నాడంట, అమ్మా నాకు నా కూతుర్ని చూడాలనిపిస్తుంది అని చెప్పాడంట. దీంతో ఆమె తెలిసిన వారితో పాపను పంపించమని మెగా ఫ్యామిలీకి చెప్పించినా, వారు పంపించలేదంట. ఎంతైనా వారు పెద్ద వారు కదా, పాపను పంపలేదు, నా కొడుకు చివరిక్షణంలో తన కూతురిని చూడలేకపోయాడు అంటూ కన్నీరు పెట్టుకుంది. అలాగే ఆమె మాట్లాడుతూ..నివృత్తి మా వంశం, మా పాప, తనను చూడాలని నాకూ ఉంటుంది. కానీ అది జరగదు. అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News