భర్త మాట విని ఆ పని చేసిన రోజా.. కోట్లరూపాయలు పొగొట్టుకున్నానంటూ కన్నీరు!

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆరోజుల్లో అందరి హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. టాలీవుడ్,

Update: 2024-07-07 03:00 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆరోజుల్లో అందరి హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరస సినిమాల చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక చిత్ర పరిశ్రమలో ఈమెకు అవకాశాలు తగ్గడంతో,రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. అయితే రోజా ఎమ్మెల్యేగా గెలిచినా, బుల్లితెరపై సందడి చేస్తూనే వచ్చింది. జబర్దస్త్ జడ్జీగా చేసి ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుండా,సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ప్రస్తుతం రోజా చాలా సైలెంట్ అయిపోయింది.

2024 ఎన్నికల్లో ఆమె దారుణంగా ఓటమి పాలు అయ్యింది. అంతే కాకుండా మెడా ఫ్యామిలీ, రజినీకాంత్‌ను దారుణంగా అవమానించింది. దీంతో ఈమెకు సినిమాల్లో అవకాశాలు కూడా రావడం కష్టమే అంటున్నారు కొందరు. ఇక తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? రోజా దర్శకు, నిర్మాత సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన కొత్తల, ఈ నటి తన భర్త మాట విని కోట్ల రూపాయలు నష్టపోయిందంట. సెల్వమణి పై ఉన్న నమ్మకంతో ఆయన దర్శకత్వంలో సుమన్ హీరోగా రోజా ఓ సినిమా నిర్మించిందంట. కానీ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో ఆమె కోట్లరూపాయలు నష్టపోయిందని, ఈ విషయం తన స్నేహితురాలుకు చెబుతూ కన్నీరు కూడా పెట్టుకున్నట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Similar News