ఆ 30 నిముషాల ఎపిసోడ్ కొత్త అనుభూతుల్ని ఇస్తుంది : దర్శకుడు శ్రీను వైట్ల

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'.

Update: 2024-10-05 14:32 GMT

దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. గోపీచంద్, కావ్యథాపర్‌పై విడుదలైన రొమాంటిక్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. దసరా కానుకగా ‘విశ్వం’ అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు.

‘గోపీచంద్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. అందుకే ఆయనను ద్రుష్టిలో పెట్టుకుని కథ రెడీ చేశాను. తను సాటిస్‌ఫై అయి షూట్‌కు వెళదాం అన్నారు. తర్వాత నిర్మాత దోనేపూడి చక్రపాణితోపాటు విశ్వప్రసాద్ జాయిన్ అయ్యాక సినిమాకు మరింత బలం చేకూరింది. అందుకే యాక్షన్ హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్స్ చేయాలని డెప్త్‌లోకి వెళ్ళి ఈ సినిమా చేశాను. ఇందులో పాప పాత్ర కీలకంగా ఉంటుంది. గోపీ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. గ్లింప్స్‌లో అటెన్షన్ కోసం అలా చూపించాం. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ రోమ్, మనాలి, గోవాలో చేశాం. రెగ్యులర్ ఫైట్స్ కాదు. సహజంగా వుంటాయి. ప్రతి యాక్షన్ హీరోయిజంలా వుంటుంది. కథ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్ వరకు వస్తారు. కంటెంట్ నమ్మి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ అని చెప్పవచ్చు. విశ్వం అనే పాత్ర జర్నీ ఇది. ఆయన జ్రర్నీలో ఎలాంటి వ్యక్తులు కలిశారు. చాలా విషయాలు ఇందులో ఉంటాయి. మెత్తంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది’ అని తెలిపారు.


Similar News