మళ్లీ జన్మించిన రామోజీరావు.. తాను అస్తమించిన రోజే , ఆయన పుట్టిన ఇంట్లోనే మరోసారి జన్మనెత్తాడా?

దిగ్గజ వ్యాపార వేత్త, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాసను విడిచిన విషయం తెలిసిందే. ఈయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2024-06-09 05:18 GMT

దిశ, సినిమా : దిగ్గజ వ్యాపార వేత్త, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాసను విడిచిన విషయం తెలిసిందే. ఈయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో రామోజీరావు పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. ఇక రామోజీరావు మరణించారు అని తెలియగానే ఎందరో ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎమోషనల్ అవుతూ.. భావోద్వేగానికి లోను అవుతున్నారు. అయితే ఇదే సమయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే, రామోజీరావు మళ్లీ జన్మించాడు. ఎవరూ బాధపడకండి అంటూ ఓ వార్త తెగ ట్రెండ్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే.. రామోజీరావు ఈయన అసలు పేరు రామయ్య. ఈయన కుష్ణా జిల్లా పామర్రు లోని ఆయన స్వగ్రామం పెదపారుపూడి లో 1936లో ఓ చిన్న ఇంట్లో జన్మించారు. అయితే ఆయన మరణ వార్త విని తన స్వగ్రామం విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఆయన అస్తమించిన రోజునే, తన స్వగ్రామంలో ఆయన పుట్టిన ఇంట్లో మరో ప్రాణం జీవం పోసుకొని, ఉషా కిరణంలా ఉదయించింది. అదే క్షణం ఓ బాబు జన్మించాడు. దీంతో అక్కడున్నవారు అందరూ ఎనిమిదిన్నర దశాబ్దాల కిందట రామోజీరావు స్వగ్రామంలో ఏ ఇంట్లో జన్మించారో.. తాజాగా ఆయన కన్నుమూసిన రోజే అదే ఇంట్లో ఓ చిన్నారి జన్మించాడు. ఆయనే మళ్లీ తన ఇంట్లో పుట్టారని సంతోషపడుతున్నారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రామోజీరావు, తన సొంత గ్రామంలో లేకపోయినా తాను తన సొంత డబ్బులు రూ.20 కోట్లతో తన గ్రామాన్ని అభివృద్ధిచేశారంట.


Similar News