యూట్యూబర్‌ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయి మంగళవారం సాయంత్రం యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Update: 2024-09-24 16:16 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయి మంగళవారం సాయంత్రం యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో సహా స్టేషన్ కు వచ్చిన యువతి.. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు.. హర్ష సాయి పై 376, 354 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. యువతిని నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేశాడని.. యువతి ఫిర్యాదు చేసిందని.. ఆమో ఫిర్యాదు మేరకు హర్షసాయిపై రేప్ కేసు నమోదు చేసుకున్నామని రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం.. ఓ యువతి.. తనను పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి నమ్మించి మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. తన వద్ద రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. అలాగే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా యువతి ఫిర్యాదు చేసింది.


Similar News