యూట్యూబర్ హర్ష సాయిపై కేసు.. మోసం చేశాడని యువతి ఫిర్యాదు

పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ప్రముఖ యూట్యూబర్ పై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Update: 2024-09-24 14:39 GMT

దిశ, గండిపేట్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ప్రముఖ యూట్యూబర్ పై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) తనను మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో రూ. రెండు కోట్ల వరకు తన వద్ద తీసుకున్నాడని యువతి ఆరోపించింది. అయితే శారీరకంగా తనను వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా హర్ష సాయి తండ్రి పేరును సైతం యువతి ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read More...

యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి


Similar News