గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పాట్‌‌లో రామోజీరావుకు నివాళులర్పించిన రామ్ చరణ్!

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు(శనివారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈయన మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి

Update: 2024-06-08 05:09 GMT

దిశ, సినిమా : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు(శనివారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈయన మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావు మృతి చాలా బాధకరం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రామోజీరావుకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు. చెర్రీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా, ప్రస్తుతం రాజమండ్రిలో సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్‌లోనే చిత్ర యూనిట్ రామోజీరావుకు నివాళులు అర్పించారు. చరణ్, దర్శకుడు శంకర్, టెక్నీషియన్లతో కలిసి రామోజీ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆయన మరణించడం తీవ్ర దు:ఖాన్ని కలిగించిందని వారు ట్వీట్ చేశారు.


Similar News